పాక్ భారత్ వైపునుంచి
యుద్ధమే కోరుకుంటోందా? మనతో తలపడిన చరిత్ర నుంచి పాక్ గుణపాఠం
నేర్చుకోలేదా? తాజా సంఘటనలు చూస్తుంటే
అవుననే అనిపిస్తోంది. తాజాగా నవాజ్షరీఫ్ ప్రధానమంత్రిత్వంలో భారత్తో స్నేహం
సంబంధాలుంటాయన్న అందరి మాటలను కొట్టిపారేస్తూ... దాయాదిదేశం ఎందుకు దాడులకు
తెగబడుతోంది. 1947 దేశ విభజన తర్వాత నుంచీ మనపై పాక్కు ఎందుకు అంత అక్కసు.
1947లో దేశం విడిపోయిన నాటి
నుంచి.. దాయాది దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా
కాశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య ఇప్పటికీ నలుగుతూనే ఉంది. ఈ సరిహద్దు తగదాలు
కాస్తా చినికి చినికి గాలి వానగా మారి నాలుగుసార్లు బీకరపోరుకు దారితీశాయి . స్వాతంత్ర్యం వచ్చిన
రెండు నెలలకే అంటే 1947 అక్టోబర్లో జరిగిన తొలి యుద్ధం.. ఫస్ట్ కాశ్మీర్ వార్గా
చరిత్రలో నిలిచింది. ఐదువారాల పాటు జరిగిన హోరాహోరీ పోరు లో ఇరువైపులా వందలాది మంది సైనికులు మరణించారు. చివరికి
ఐక్యరాజ్యసమితి జోక్యంతో నాడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
భారత్, పాక్ల మధ్య 1965లో రెండో
సారి యుద్ధభే రి మోగింది. గుజరాత్ లోని
రాణా ఆఫ్ కచ్ ప్రాంతంతో పాటు భారత్ లోని మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు
దాయాది తీవ్రంగా ప్రయత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొదట పోలీసుల కాల్పులతో
ప్రారంభమైన ఉద్రిక్తత, తీవ్రత పెరిగి యుద్దంగా మారింది. రెండుదేశాలూ సైనికులను
రంగంలోకి దించాయి. ఈసారి దాయాదుల పోరును తీర్చే బాధ్యతను నాటి బిట్రిష్
ప్రధానమంత్రి హెరాల్డ్ విల్ సన్ తీసుకున్నారు. ఇరుదేశాలతో చర్చలు జరిపి ఒక
ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేశారు. దాని తీర్పుతో గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ లోని 350
మైళ్ల ప్రాంతం పాకిస్థాన్ వశమైంది. అయినా, పాక్ మాత్రం తమ భూభాగం 3వేల500
మైళ్లుందని అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.
ఇక అదే ఏడాది ఆగస్ట్ 5న 30 వేలమంది
పాక్ చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించారు. ఇంతమందిని వెనక్కుపంపడానికి భారత్కున్న
ఏకైక అస్త్రం యుద్ధం. పాకిస్ధాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ పై సమరం జరిపిన భారత్
పైచేయి సాధించింది. పాకిస్థాన్ కూడా ధీటుగానే పోరాడి కొంత భూబాగాన్నితన
వశంచేసుకోగలిగింది. ఇదే యేడాది సెస్టెంబర్లో మరోసారి పాక్, జమ్ముని టార్గెట్
చేసింది. ఆప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని భారతకు వచ్చే ఆయుధాలను నిలిపివేయాలని
వ్యూహంపన్నింది. యుద్దట్యాంకులతో తెగబడింది. ఊహించని ఈ దాడితో భారత సైన్యానికి
చేదు అనుభవం ఎదురైంది. వాయుసైనను రంగంలోకిదించి శత్రు సైన్యాన్ని చెల్లాచెదురు
చేసింది .
1971 లో భారత భూభాగంలోని సియాచిన్,
హిమనీ నదులు మీద పట్టుసాధించడానికి చుట్టు పక్కల ఉన్న కొండలపై పాక్ సైనిక
స్థావరాలను ఏర్పాటు చేసింది. దీంతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. 1980 లో కాశ్మీర్ లో
పాకిస్థాన్ వేర్పాటువాదం, అణుప్రయోగాల వల్ల మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వీటిని
శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు లాహోర్ ఓప్పందాన్ని
కుదుర్చుకున్నాయి .
ఆ ఒప్పందం తర్వాత పైకి
ప్రశాంతంగా ఉన్నా.. పాక్ లోలోపల రగులుతూనే ఉంది. అది ముదరడంతో 1998 శీతాకాలంలో పాకిస్థాన్ సైన్యం
కొంత మంది సైనికులను ముజూహిదీన్ ల రూపంలో కాశ్మీర్కు పంపింది. ఈచర్యను ఆపరేషన్ బద్ర్
గా వ్యవహరిస్తారు.
ఇక ఆ తర్వాత.. జరిగిన మహా
సంగ్రామం కార్గిల్ వార్. ఓ వైపు కాశ్మీర్కు, తమకు సంబంధం లేదని చెప్తూనే మరోవైపు
నుంచి అక్రమంగా భారత్పై తెగబడింది పాక్.
1999లో తలెత్తిన ఈ పరిస్థితిని ఉపేక్షించని అప్పటి NDA ప్రభుత్వం పాకిస్థాన్ తో సమరానికి సై అంది. దీంతో కాశ్మీర్
లోని కార్గిల్ ప్రాంతంలో మరోసారి ఇరుదేశాల మధ్యపరోక్షంగా భీకర యుద్దం జరిగింది. ఈ యుధ్దం నేపథ్యంలోనే భారత్లోని ప్రతీపౌరుడు
మనసులోని దేశభక్తిని బయటపెట్టాడు. సైనికులకు వెన్నంటి ఉండడమే కాదు... అవసరమైతే
సరిహద్దులోకి వచ్చి శత్రువులను ఎదుర్కుంటామని చాటాడు. కానీ ఆ అవసరం లేకుండానే
భారత్ సైన్యం సత్తా చాటింది. ఈ పోరులో భారత్కు ఘన విజయం దక్కగా.. పాక్
సైనికులతో పాటు, ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయింది .
ఇవే ఇప్పటివరకూ ఇరుదేశాల
మధ్య చోటుచేసుకున్న యుద్ధాలు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి భారత్ సంయమనంగా
ఉన్నా... పాక్ మాత్రం ప్రతీసారీ దాన్ని చేతగాని తనంగానే భావించింది. ఆ మేరకు తగిఅనుభవించింది.
ఇక కార్గిల్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోని వచ్చాక భారత్.. పాక్ వైపు
కన్నెత్తి చూసింది లేదు. యుద్ధానికి ఆరాటపడిందీ లేదు. కానీ, నేటికీ పాక్
పాలకుల్లో, సైన్యంలో మార్పు రాలేదు.
ఒకటికాదు.. రెండుకాదు...
14ఏళ్లుగా, ఇదే తంతు. సరిహద్దుల్లో పాక్ నుంచి నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్య.
ఇటీవలికాలంలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. గడచిన పదిరోజుల్లోనే పాక్ సైన్యం
12సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. అంతకుముందు... ఐదుగురు ఇండియన్
జవాన్లను అత్యంత కిరాతకంగా చంపి.. బోర్డర్లో
పడేసింది. ఏమీ ఎరగననట్లు.. మా పరిధిలో మీవాళ్ల శవాలున్నామంటూ చెప్పుకొచ్చింది.
కానీ, పోస్ట్ మార్టం రిపోర్లు నిర్దారణవేరు. ఆ తర్వాతా ఆడియోవీడియో టేపుల్లో వెల్లడైన నిజాలను బట్టి... పాక్ సైనికులే ఈ
దుశ్చర్యకు పాల్పడ్డారని తేటతెల్లమైంది.
ఇంత జరుగుతున్నా భారత్
మాత్రం పాక్తో స్నేహపూర్వక సంబంధాన్నే కోరుకుంటోంది. పాకిస్థాన్ మాత్రం ఇందుకు విరుద్దంగా భారత్ ను
దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పన్నాగాలు పన్నుతూనే ఉంది. దేశాన్ని ఆక్రమించేందుకు
ప్రయత్నిస్తూనే ఉంది. ఇటు చైనావైపు నుంచి ఇదే తరహా చొరబాట్లు... ఎదురవుతున్నా,
యుద్ధం కాదుకదా, కనీసం హెచ్చరించే పరిస్థితుల్లోనూ మన దేశ పాలకులు లేరన్నది
జగమెరిగిన సత్యం. పార్లమెంటు వేదికగా చేసే తూతూమంత్రపు వ్యాఖ్యానాలు, ఖండనలు...
పొరుగుదేశాల్లో భారత్ అంటే చులకన భావం ఏర్పడేలా చేస్తున్నాయి.
No comments:
Post a Comment